కొత్త గనులు తెస్తం.. జాబ్ లు కల్పిస్తం..గతంలో సింగరేణికి బొగ్గు గనులు రాకుండా అడ్డుకున్న బీఆర్ఎస్

కొత్త గనులు తెస్తం.. జాబ్ లు కల్పిస్తం..గతంలో సింగరేణికి బొగ్గు గనులు రాకుండా అడ్డుకున్న బీఆర్ఎస్
  • గ్రామీణ క్రీడాకారులను జాతీయస్థాయికి తీసుకెళ్తాం 
  • గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి     అటవీ పర్మిషన్లకు ప్రయత్నాలు
  • మంచిర్యాల జిల్లాలోని సమ్మక్క, సారలమ్మ జాతర్లలో పూజలు చేసిన మంత్రి

కోల్​బెల్ట్/కోటపల్లి/చెన్నూరు,వెలుగు:  సింగరేణిలో కొత్త బొగ్గు గనులకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు.  కొత్త బొగ్గు గనులు తవ్వకాలతోనే సింగరేణి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​(క్యాతనపల్లి), చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు. 

మందమర్రి ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్​పాలవాగు ఒడ్డున, చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని అక్కెపల్లి, మల్లంపేటలో సమ్మక్క,సారలమ్మ జాతరల్లో పాల్గొన్నారు.  మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్​.రాధాకృష్ణ, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్​తో కలిసి మంత్రి వనదేవతలకు పూజలు చేశారు. 

మంత్రి మాట్లాడుతూ.. రామకృష్ణాపూర్​లో ఓసీపీ రెండోఫేజ్​ను అందుబాటులోకి తీసుకొస్తామని, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.  గతంలో కొత్త గనులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందన్నారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డిని ఒప్పించి సింగరేణి వేలంలో పాల్గొని కొత్త బొగ్గు బ్లాక్​లను పొందేలా పర్మిషన్​తీసుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్​ హయాంలో చెన్నూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 

ఎమ్మెల్యే అయిన తర్వాత రూ.100కోట్ల నిధులతో అమృత్​స్కీమ్ ద్వారా  మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు సప్లై చేయిస్తున్నామన్నారు.  క్యాతనపల్లిలో ఆర్వోబీ పూర్తిచేసి లైటింగ్​సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రూ.50కోట్లతో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేసి, కొత్త కోర్సులపై శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. 

సమ్మక్కసారలమ్మ అమ్మవార్ల దీవెనలు, ఆశీస్సులు రాష్ట్ర ప్రజందరికి ఉండాలని మంత్రి కోరుకున్నట్టు చెప్పారు. కోటపల్లిలో కాంగ్రెస్​నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్​తండ్రి దివంగత రామకృష్ణయ్య- పురాణం, శ్యాంసుందర్​రావు స్మారకార్థం నిర్వహించిన కోటపల్లి ప్రీమియర్​లీగ్​సీజన్​క్రికెట్​టోర్నమెంట్​ విన్నర్ కోటపల్లి, రన్నరప్​గొర్లపల్లి టీమ్ లకు మంత్రి బహుమతులు అందించారు. 

గ్రామాల్లోని ప్రతిభావంతులైన క్రికెట్లను జాతీయస్థాయిలో వెలుగులోకి  తీసుకరావడమే తమ లక్ష్యమన్నారు. కాకా వెంకటస్వామి మెమోరియల్​ తెలంగాణ ఇంటర్​డిస్ర్టిక్ట్​ టీ 20 క్రికెట్​లీగ్​ను విజయవంతంగా చేపట్టామన్నారు.  కోటపల్లి మండలంలో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ పర్మిషన్ల క్లియరెన్స్​ కోసం కృషి చేస్తున్నామన్నారు.