
- సానుకూలంగా స్పందించిన మంత్రి
కోల్బెల్ట్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్ల ను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సింగ రేణి ఆఫీసర్లు శనివారం కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సింగరేణి బ్రాంచ్అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీపతిగౌడ్,పెద్ది నర్సింహులు ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరి యాల అసోసియేషన్ బాధ్యులు మంత్రిని కలిసి సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆఫీసర్లు మాట్లా డుతూ.. 2022–23,2023–24 ఆర్థిక సంవత్సరాల ఫర్ఫార్మెన్స్ రిలేటెడ్పే(పీఆర్పీ) చెల్లింపులో సింగరేణి యాజమాన్యం ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నదని పేర్కొన్నారు.
కోల్ఇండియా పరిధిలో ఆఫీసర్లకు ఇప్పటికే చెల్లించారని, సింగరేణిలో వెంటనే పీఆర్పీ బకాయిలు ఇవ్వాలన్నారు. సింగరేణి ఉద్యోగులకు కల్పిస్తున్న మాదిరిగా ఉచిత విద్యుత్, ఐఐటీ/ఐఐఎం ఫీజు రీయింబర్స్మెంట్ను ఆఫీసర్లకు కూడా వర్తింపజేయాలన్నారు. తమ డిమాండ్లు, సమస్యలను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎనర్జీ సెక్రట రీ దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రిని కోరారు. ఇం దుకు స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సింగరేణి ఆఫీసర్ల పీఆర్పీ బకాయిలు, ఇతర సమస్యలను త్వరలో సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఆఫీసర్ల సంఘంసెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్, రామగుండం1, 11 ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు పెరుమాల్ల శ్రీనివాస్, రాముడు తదితరులు ఉన్నారు.