మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన సింగరేణి ఆఫీసర్లు

మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన సింగరేణి ఆఫీసర్లు
  • సానుకూలంగా స్పందించిన మంత్రి 

కోల్​బెల్ట్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్ల ను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సింగ రేణి ఆఫీసర్లు శనివారం కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​లో కోల్​మైన్స్ ఆఫీసర్స్​ అసోసియేషన్​ సింగరేణి బ్రాంచ్​అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీపతిగౌడ్,పెద్ది నర్సింహులు ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరి యాల అసోసియేషన్​ బాధ్యులు మంత్రిని కలిసి సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆఫీసర్లు మాట్లా డుతూ.. 2022–23,2023–24 ఆర్థిక సంవత్సరాల ఫర్ఫార్మెన్స్ ​రిలేటెడ్​పే(పీఆర్​పీ) చెల్లింపులో సింగరేణి యాజమాన్యం ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నదని పేర్కొన్నారు.

 కోల్​ఇండియా పరిధిలో ఆఫీసర్లకు ఇప్పటికే చెల్లించారని, సింగరేణిలో వెంటనే పీఆర్​పీ బకాయిలు ఇవ్వాలన్నారు. సింగరేణి ఉద్యోగులకు కల్పిస్తున్న మాదిరిగా ఉచిత విద్యుత్, ఐఐటీ/ఐఐఎం ఫీజు రీయింబర్స్​మెంట్​ను ఆఫీసర్లకు కూడా వర్తింపజేయాలన్నారు. తమ డిమాండ్లు, సమస్యలను సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎనర్జీ సెక్రట రీ దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రిని కోరారు. ఇం దుకు స్పందించిన మంత్రి వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. సింగరేణి ఆఫీసర్ల పీఆర్​పీ బకాయిలు, ఇతర సమస్యలను త్వరలో సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఆఫీసర్ల సంఘంసెంట్రల్​ వైస్​ ప్రెసిడెంట్  పొనుగోటి శ్రీనివాస్, రామగుండం1, 11 ఏరియాల వైస్​ ప్రెసిడెంట్లు పెరుమాల్ల శ్రీనివాస్, రాముడు తదితరులు ఉన్నారు.