శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-8 డిస్పెన్సరీలో రక్తదాన శిబిరం

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-8 డిస్పెన్సరీలో రక్తదాన శిబిరం

కోల్​బెల్ట్, వెలుగు: శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే-–8 డిస్పెన్సరీలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎంవీటీసీలో శిక్షణ పొందుతున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్​ ఉద్యోగులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఎంవీటీసీ మేనేజర్ కమ్రుద్దీన్​, డీవైసీఎంవో డాక్టర్​రమేశ్​బాబు, ఏటీవో రామారావు తదితరులున్నారు. 

మనోరంజన్​ సముదాయ్ ​తనిఖీ 

శ్రీరాంపూర్​ఏరియా నస్పూర్​కాలనీలోని మనోరంజన్​ సముదాయ్​ని జీఎం శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఇక్కడి ఫంక్షన్​హాల్​లో యాజమాన్యం అన్ని మౌలిక సదుపాయాలను కల్పించిందని, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీజీఎం(పర్సనల్​) పి.అరవింద్​రావు, డీజీఎం ఆనంద్​కుమార్, సెక్యూరిటీ ఆఫీసర్​ జక్కారెడ్డి, ఈఈ సత్యనారాయణ ఉన్నారు.