
కోల్బెల్ట్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-–8 డిస్పెన్సరీలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎంవీటీసీలో శిక్షణ పొందుతున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఎంవీటీసీ మేనేజర్ కమ్రుద్దీన్, డీవైసీఎంవో డాక్టర్రమేశ్బాబు, ఏటీవో రామారావు తదితరులున్నారు.
మనోరంజన్ సముదాయ్ తనిఖీ
శ్రీరాంపూర్ఏరియా నస్పూర్కాలనీలోని మనోరంజన్ సముదాయ్ని జీఎం శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఇక్కడి ఫంక్షన్హాల్లో యాజమాన్యం అన్ని మౌలిక సదుపాయాలను కల్పించిందని, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీజీఎం(పర్సనల్) పి.అరవింద్రావు, డీజీఎం ఆనంద్కుమార్, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కారెడ్డి, ఈఈ సత్యనారాయణ ఉన్నారు.