సమ్మర్​ స్పోర్ట్స్ కోచింగ్​ను ఉపయోగించుకోవాలి : జీఎం జి.దేవేందర్

సమ్మర్​ స్పోర్ట్స్ కోచింగ్​ను ఉపయోగించుకోవాలి : జీఎం జి.దేవేందర్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల పిల్లల్లో దాగిఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు సింగరేణి యాజమాన్యం సమ్మర్​ స్పోర్ట్స్ కోచింగ్​ క్యాంప్​ నిర్వస్తోందని మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్ అన్నారు. డబ్ల్యూపీఎస్​ అండ్​ జీఏ ఆధ్వర్యంలో మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, సోమగూడెంలో నిర్వహించే సమ్మర్​ కోచింగ్​ క్యాంప్​లను మంగళవారం సాయంత్రం మందమర్రి సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో జీఎం ప్రారంభించారు. 

ఆయన మాట్లాడుతూ.. 25 రోజుల పాటు వాలీబాల్, బాస్కెల్​బాల్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్​పై కార్మికుల పిల్లలకు కోచ్​ల ద్వారా ట్రైనింగ్​ ఇస్తామన్నారు. ఈ క్యాంపును పిల్లలు సద్వినియోగం చేసుకొని స్పోర్ట్స్​లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటు జీఎం విజయప్రసాద్, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సత్యనారాయణ, ఆఫీసర్స్​అసోసియేషన్​ ప్రెసిడెంట్ రమేశ్, పర్సనల్​ మేనేజర్​శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి ఎం.కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.