సింగరేణి సూపర్ బజార్ మూసివేత?..సామగ్రి తరలించిన యాజమాన్యం

సింగరేణి సూపర్ బజార్ మూసివేత?..సామగ్రి తరలించిన యాజమాన్యం

కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికుల సౌకర్యం కోసం యాజమాన్యం 1979 మార్చి 29న రామకృష్ణాపూర్​లో సూపర్​బజార్​ఏర్పాటు చేసింది. రూ.15 వేల వరకు అరువుపై నిత్యావసర సరుకులు అందించి, వారికి చేయూతనిచ్చింది. కానీ, ఇటీవల సంస్థ వ్యాప్తంగా సూపర్​బజార్లు మూతపడున్నాయి.

శుక్రవారం రామకృష్ణాపూర్​బజార్​లోని సరుకులు ప్యాక్​చేసి, మందమర్రికి తరలించారు. ఈ బజార్​మూసివేతకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సూపర్ బజార్ లేకపోతే తాము ఇబ్బంది పడతామని, మూసివేయొద్దని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి. ఈ విషయం తన దృష్టికి రాలేదని మందమర్రి ఏరియా సింగరేణి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు.