
కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికుల సౌకర్యం కోసం యాజమాన్యం 1979 మార్చి 29న రామకృష్ణాపూర్లో సూపర్బజార్ఏర్పాటు చేసింది. రూ.15 వేల వరకు అరువుపై నిత్యావసర సరుకులు అందించి, వారికి చేయూతనిచ్చింది. కానీ, ఇటీవల సంస్థ వ్యాప్తంగా సూపర్బజార్లు మూతపడున్నాయి.
శుక్రవారం రామకృష్ణాపూర్బజార్లోని సరుకులు ప్యాక్చేసి, మందమర్రికి తరలించారు. ఈ బజార్మూసివేతకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సూపర్ బజార్ లేకపోతే తాము ఇబ్బంది పడతామని, మూసివేయొద్దని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి. ఈ విషయం తన దృష్టికి రాలేదని మందమర్రి ఏరియా సింగరేణి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు.