ఎస్టీపీపీ సోలార్ పవర్ ప్లాంట్కు అవార్డులు

ఎస్టీపీపీ సోలార్ పవర్ ప్లాంట్కు అవార్డులు

జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్, సోలార్  పవర్​ ప్లాంట్​కు జాతీయ అవార్డులు దక్కాయి. గురువారం మహారాష్ట్ర గ్రీన్​ ఎన్​వీరో ఫౌండేషన్​ ఆధ్వర్యంలో లోనావాలా సిటీలో గ్రీన్​ ఎన్విరాన్​మెంట్​ అవార్డ్స్​ అండ్​ సమ్మిట్–​2025 కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి థర్మల్  పవర్  ప్లాంట్​కు గోల్డ్​ అవార్డ్  ఇన్​ ఎన్విరాన్​మెంట్ ఎక్స్​లెన్స్, సోలార్​ పవర్​ ప్లాంట్​కు సస్టేనేబుల్​ డెవలప్​మెంట్​ అవార్డులు ప్రకటించారు. 

అవార్డులను సింగరేణి తరుపున జీఎం(ఈఎం)జానకీరామ్​ అందుకున్నారు. రెండు జాతీయ స్థాయి అవార్డులు దక్కడం పట్ల సింగరేణి సీఎండీ ఎన్  బలరాంనాయక్, డైరెక్టర్​ సత్యనారాయణ, ఎస్టీపీపీ జీఎం కె శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్లాంట్ ఉద్యోగులు, ఆఫీసర్ల కృషితోనే అవార్డులు వచ్చాయని అభినందించారు.