
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్కు జాతీయ అవార్డులు దక్కాయి. గురువారం మహారాష్ట్ర గ్రీన్ ఎన్వీరో ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోనావాలా సిటీలో గ్రీన్ ఎన్విరాన్మెంట్ అవార్డ్స్ అండ్ సమ్మిట్–2025 కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు గోల్డ్ అవార్డ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఎక్స్లెన్స్, సోలార్ పవర్ ప్లాంట్కు సస్టేనేబుల్ డెవలప్మెంట్ అవార్డులు ప్రకటించారు.
అవార్డులను సింగరేణి తరుపున జీఎం(ఈఎం)జానకీరామ్ అందుకున్నారు. రెండు జాతీయ స్థాయి అవార్డులు దక్కడం పట్ల సింగరేణి సీఎండీ ఎన్ బలరాంనాయక్, డైరెక్టర్ సత్యనారాయణ, ఎస్టీపీపీ జీఎం కె శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్లాంట్ ఉద్యోగులు, ఆఫీసర్ల కృషితోనే అవార్డులు వచ్చాయని అభినందించారు.