
జైపూర్, వెలుగు: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగుల నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎస్టీపీపీ ఎస్సీ లైజన్ ఆఫీసర్ గా వెంకటయ్య, చీఫ్ అడ్వైజర్ గా శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గా పులి సురేశ్ఎన్నికయ్యారు.
వీరు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులును కలిసి సన్మానించారు. మెయిన్ గేట్ వద్ద సింగరేణి స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్టీపీపీలో కార్పొరేట్ జీఎం(సోలార్) గా విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందిన జానకీరాంను సత్కరించారు.