రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 53 ఫిర్యాదులు వచ్చినట్లు అడిషనల్కలెక్టర్తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాస్ రావు , ఆర్డీవో పవన్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్లో 175 ఫిర్యాదులు
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 175 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 728లోని 4.02ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామానికి చెందిన డి.బాబు కొంతమందితో కలిసి గ్రీవెన్ సెల్ లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నా బిడ్డకు పింఛన్ ఇప్పించుండ్రి
పెద్దపల్లి, వెలుగు: ఏడేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని, దివ్యంగురాలైనా తన బిడ్డ శైలజకు ఇప్పటికైనా పింఛన్ ఇప్పించండని పెద్దపల్లి మండలం తురకల మద్దికుంటకు చెందిన విలాసాగరపు మల్లయ్య అధికారులను వేడుకున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా దివ్యాంగురాలు శైలజ తండ్రి మల్లయ్యతో కలిసి అధికారులకు వినతిపత్రంఇచ్చారు. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 శాతం దివ్యాంగురాలిగా సర్టిఫికెట్ ఇచ్చారని, అయినా నేటికీ పింఛన్రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.