మేము ఎవరికీ డేటా ఇవ్వలేదు: సిట్

మేము ఎవరికీ డేటా ఇవ్వలేదు: సిట్

TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మార్చి 31వ తేదీన సిట్ పై చేసిన ఆరోపణలకు సిట్ అధికారలు స్పదించారు. తాము ఎవరికి డేటా ఇవ్వలేదని కోర్టుకు నివేదికను ఇస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ అభ్యర్థుల విచారణ పూర్తి చేశామని.. Tspsc పేపర్ లీకేజీ కేసులో బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చామని సిట్ అధికారులు తెలిపారు. బోర్డు ఛైర్మెన్, సెక్రెటరీ వాగ్మూలం రికార్డ్ చేస్తామన్నారు.ఇప్పటికే లింగా రెడ్డికి నోటీస్ జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. లింగా రెడ్డి పీఏ రమేష్ ను అరెస్ట్ చేశామని సిట్ అధికారులు చెప్పారు. Tspsc లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసిన రమేష్ ఇచ్చిన వాగ్మూలంతో లింగా రెడ్డికి నోటీసులు పంపినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అంశం లింగా రెడ్డికి తెలుసా.. అనే కోణంలో అరా తీస్తున్నమని అధికారులు చెప్పారు. ఈ కేసులో 14 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని.. అందులో నాలుగు లక్షలు సీజ్ చేశామని సిట్ అధికారులు వివరించారు.

పేపర్ లీక్ కేసులో నిందితులకు కేటీఆర్ కు సంబంధమేంటని.. అసలు కేటీఆర్ కు ఎగ్జామ్ డేటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అధికారులు కాకుండా కేటీఆర్ కు డేటా ఎవరిచ్చారో ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు రేవంత్. పేపర్ లీక్ కేసులో కావాల్సిన వాళ్లను కాపాడేందుకే సిట్ ఏర్పాటు చేశారని రేవంత్ ఆరోపించారు. గతంలో ఇలాగే సిట్ ఏర్పాటు చేసిన కేసులన్నీ తప్పుదోవపట్టించారని విమర్శించారు.   ప్రభుత్వం ఇరుకున పడ్డప్పుడల్లా సిట్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.పేపర్ లీక్ కేసులో ఏ1గా శంకర్ లక్ష్మీని చేర్చాలని డిమాండ్ చేశారు. శంకర్ లక్ష్మీకి తెలియకుండా ఏం జరగదన్నారు. ఆర్థిక పరమైన నేరారోపణలున్నప్పుడు కేసును ఈడీతో విచారణ జరిపించాలన్నారు రేవంత్. పేపర్ లీక్ కేసుపై  ఢిల్లీలో సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు సిట్ సీజ్ చేసిన వాటిని ఈడీ తీసుకోవాలన్నారు.