నీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టండి : సీతక్క

నీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టండి : సీతక్క

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో  నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సోమవారం ఆమె పంచాయతీరాజ్​శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్​కుమార్​ సుల్తానియా, కలెక్టర్లు, మిషన్​భగీరథ సూపరింటెండింగ్ ఇంజినీర్లు, జిల్లా పంచాయతీరాజ్​అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్పెషల్​డ్రైవ్​ చేపట్టి గ్రామాల్లో  మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని..అవసరమైన రిపేర్లు చేయాలని అధికారులకు సీతక్క స్పష్టం చేశారు. వార్షిక నిర్వహణ పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా పంచాయతీ అధికారులు, మిషన్​ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​ అనితా రామచందన్, మిషన్​భగీరథ ఇంజినీరింగ్​చీఫ్​ కృపాకర్​రెడ్డి, పంచాయతీరాజ్, మిషన్​భగీరథ అధికారులు పాల్గొన్నారు.