![భద్రాచలంలో రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన](https://static.v6velugu.com/uploads/2023/10/Sitarama-Chandraswami_icYL3Ohj6I.jpg)
భద్రాచలం,వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో అర్చన జరిగింది. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించారు. భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం జరిపాక గర్భగుడిలో మూలవరులకు బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు.
హైదరాబాదుకు చెందిన వేణుమాధవ్,శిరీషలు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1లక్ష విరాళం ఇచ్చారు. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది. కంకణాలు ధరించి భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ జరిగింది.