
ఆడ పిల్లలకు ఏ వయసులో పెళ్లి చేయాలన్న దానిపై అధ్యయనం చేసేందుకు ఓ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయంపై ప్రకటన చేశారు. అమ్మాయిల పెళ్లి వయసుపై ఈ టాస్క్ఫోర్స్ కమిటీ సలహాలు, సూచనలు ఇస్తుందని చెప్పారు. బాల్య వివాహాలను నివారించేందుకు, ఆడ పిల్లల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే స్త్రీ, శిశు సంక్షేమం పైనా ఈ టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేస్తుంది.