
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా గత ఆరు గంటలు పైగా విచారణ కొనసాగుతోంది. ముందుగా సింగిల్ గా కవితను విచారించిన అధికారులు ఆ తరవాత పిళ్లై, సిసోడియాతో కలిపి విచారిస్తున్నారు. కవిత విచారణ రాత్రి 8 గంటల వరకు జరగనున్నట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీలోనే ఆరుగురు మంత్రులు మకాం వేశారు. న్యాయనిపుణలతో ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్ మంతనాలు జరుపుతున్నారు. మంత్రలతో పాటుగా స్టేట్ ఇంటెలిజిన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు.