ఈ ఉదయం సికింద్రాబాద్ వారాసిగూడ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారాసిగూడకు చెందిన గౌస్ షబానా ఇంట్లో తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలోనే సిలిండర్ పేలింది. దీంతో షబానా దంపతులతో పాటు, వారి నలుగురు కూతుళ్లు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడ్డవారిని ట్రీట్మెంట్ కోసం స్థానికులు గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
see more news