జీడిమెట్ల, వెలుగు: ఒడిశా నుంచి మహారాష్ట్రకు సిటీ మీదుగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురిని బాలానగర్ ఎస్ వోటీ, శామీర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జీడిమెట్లలోని బాలానగర్ డీసీపీ ఆఫీసులో డీసీపీ సందీప్ కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకి చెందిన రవిధన్ సింగ్ చౌహన్(37), కిరణ్రామ్ పవార్(35), వికాస్ మన్ సింగ్ చౌహాన్(43), అదేశ్ శాంత్ కుమార్ జాదవ్(22), కిషన్ చౌహాన్(36), ఒడిశాకు చెందిన నర్సింగ్ మాడీ(32) వీరంతా గ్యాంగ్ గా ఏర్పడి ఈజీ మనీ కోసం గంజాయి సప్లయ్ చేస్తున్నారు. నర్సింగ్ ఒడిశాలోని షేర్ పల్లి ఏజెన్సీలో గంజాయి పండించే వారిని నుంచి దాన్ని సేకరించేవాడు. తర్వాత గంజాయిని ఒడిశా నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రలోని సోలాపూర్ కు రవిధన్ గ్యాంగ్ తరలించేది. ఇటీవల రవిధన్ సింగ్ ఒడిశాకు వెళ్లి నర్సింగ్ మాడీని కలిసి 800 కిలోల గంజాయి కావాలని చెప్పి కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చాడు. కానీ నర్సింగ్ 350 కిలోల గంజాయిని మాత్రమే సమకూర్చాడు. ఆ గంజాయి ప్యాకెట్లను తీసుకున్న రవిధన్ సింగ్ గ్యాంగ్, నర్సింగ్ తో కలిసి రెండు కార్లలో ఒడిశా నుంచి సిటీ మీదుగా సోలాపూర్కు బయలుదేరింది. దీని గురించి సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. శామీర్ పేట పరిధిలోని ఓఆర్ఆర్ వద్ద కార్లను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు రవిధన్ తో పాటు అతడి గ్యాంగ్ కు చెందిన నలుగురు, నర్సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. రూ. 80 లక్షల విలువైన 350 కిలోల గంజాయి, రెండు కార్లు, స్వాధీనం చేసుకున్నారు.
అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురు అరెస్ట్
- తెలంగాణం
- August 3, 2022
లేటెస్ట్
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
- పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే
- ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్గా భూపాలపల్లి
- కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు
- జీతాల కోసం మెరుపు సమ్మె
- గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు