
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి మల్లు విక్రమార్క అన్నారు. ఇవాళ సచివాలయంలో మంత్రి సీతక్కతో కలిసి బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంఆ ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల కోచింగ్కు నిపుణులైన వారితో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు.
నాలుగు నెలల్లో ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. యువత ఉపాధి లేక ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఫీజు రీయింబ్స్మెంట్ పథకం అందుబాటులోకి వచ్చాకి వేలాది మంది బీటెక్ పూర్తి చేసి స్కిల్స్ లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారన్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిషన్ మిషన్ భగీరథ పథకం పనితీరుపై ఈ నెల 15 వరకు నివేదిక ఇవ్వాలని కోరారు. మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే అంశం గ్రామసభల్లో ఓ ఎజెండాగా చేర్చాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.