
ప్రధాని నరేం ద్ర మోడీ మంచి వక్త అని జనానికి తెలుసు. ప్రసంగాల్లో ఆయన చేస్తు న్న నినా దాలు జనంలోకి దూసుకుపోతున్నాయి. దీనికి మంచి ఉదాహరణ ఆయన తరచూ వాడుతున్న ‘చౌకీదార్ ’ (కాపలాదారు) స్లోగనే. ఇది ప్రజల్లో కి బాగా చొచ్చుకుపోయింది. అందుకే ఈ లోక్ సభ ఎన్నికల్లో దీన్నే ఆయన తన ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయో-గించుకుంటున్నారు . రాజకీయంగా మోడీ ఎదుగుదలను చూసినవారికి మాత్రం ప్రధాని స్లోగన్లు ఇవ్వడంలో ఎంత సిద్ధహస్తులో బాగా తెలుసు. ప్రజా ఉద్యమాలు సందర్భంగా జనం నినా దాలు ఇవ్వడానికి వీలుగా చిన్నచిన్న పదాలతో క్యా చీగా ఉండేలా స్లోగన్స్ సొంతంగానే కనిపెట్టేవారని , అవి ప్రజల్లో కి బాగా దూసుకుపోయేవని గుజరాత్ బీజేపీ నాయకులు కొందరు చెప్పారు.
ఆర్ ఎస్ఎస్ లో పనిచే సిన తర్వా త 1987-88లో మోడీ బీజేపీలో చే రారు. 1984 లోక్ సభ ఎన్నికల నాటికి ఆపార్టీకి కేవలం ఇద్దరు లోక్ సభ సభ్యులు మాత్రమే ఉన్నారు . గుజరాత్ లో బీజేపీని బలోపేతం చేసేందు కు ప్రయత్నిం చిన మోడీకి గోడలమీది ‘జై బాబా సద్గరు ’ అన్న పెయింటింగ్స్ కనిపిం చాయి. ఇది తన రాజకీయ ప్రచారానికి బాగా పనికొస్తుం దని అంచనావేసిన మోడీ పది మంది పెయింటర్లను హైర్ కు తీసుకున్నారు . మంచి క్వా లిటీ పెయిం ట్ ను వినియోగించి పా ర్టీ గుర్తైన కమలం బొమ్మను గుజరాత్ అంతటా పెయింటింగ్స్ వేయడానికి వాళ్లను పురమాయిం చారు. ‘జై బాబా సద్గరు ’ అన్న నినాదానికి అదనంగా ‘ బాస్ , అబ్ బీజేపీ’ అని కమలం గుర్తు దగ్గర మరో లైన్ ను యాడ్ చే శారు . కాం గ్రెస్ ను గద్దె దిం పడమే లక్ష్యంగా తయారు చేసిన పొలిటికల్ మెస్సేజ్ ఇది. 1995లో గుజరాత్ బీజేపీ అధికారంలోకి తొలిసారిగా రావడానికి పరో-క్షం గా ఇలాం టి స్లోగన్స్ ఎన్నో ఉపయోగపడ్డా యి. గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే మోడీ ‘ జీతేగా గుజరాత్ ’( గుజరాత్ గెలుస్తుం ది) అంటూ మరో స్లో గన్ ను ఖాయం చే శారు . రాష్ట్ర ఆకాం క్షలకు తానే సరైన ప్రతినిధినని చెప్పుకునేలా ప్రచారం చే -సుకున్నారు . ప్రతిపక్షాన్ని ‘యాం టీ- గుజరాత్ ’ అని టార్గె ట్ చే శారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఆయన వాడుతున్న ‘చౌకీదార్ ’ నినాదం కూడా చిన్నాపెద్ద తేడాలేకుండా, చదువుకున్నవారు, చదువులేనివాళ్లు భేదంలేకుండా అందర్నీ ఆకట్టుకుం టోంది.