కొత్తపల్లి, వెలుగు: చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణలకు దారితీస్తాయని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ఈ–టెక్నో స్కూల్లో జరుగుతున్న సైన్స్ఫేర్ను ఆదివారం ఆయన సందర్శించారు. విద్యార్థులు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ కొత్తగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు.
జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 2,652 మంది విద్యార్థులు సైన్స్ఫేర్కు వచ్చారన్నారు. చివరి రోజు సోమవారం మిగతా పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి, ప్రదర్శనలను చూడాలని చెప్పారు. డీసీఈబీ సెక్రటరీ భగవంతయ్య, సెక్టోరియల్ ఆఫీసర్స్అశోక్రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్, కృపారాణి, కొత్తపల్లి, గంగాధర, సైదాపూర్, గన్నేరువరం ఎంఈవోలు ఆనందం, ప్రభాకర్రావు, రవీంద్రాచారి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
