కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ ఎయిర్క్రాఫ్ట్ ఇండ్లపై కూలింది. ఈ ప్రమాదంలో మన దేశ మూలాలున్న ఓ కార్డియాలజిస్ట్, మరో కార్మికుడు చనిపోయారు. ఇంకో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విమానంతోపాటు రెండు ఇండ్లు, పార్క్చేసిన పలు వెహికల్స్కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన డాక్టర్సుగత దాస్ఇండియాలో బెంగాలీ కుటుంబంలో జన్మించారు. పుణెలో పెరిగారు. అమెరికాలోని శాన్డియాగోలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం అరిజోనాలోని యుమా రీజినల్ మెడికల్ సెంటర్(వైఆర్ఎంసీ)లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఎయిడ్స్ బాధితులను ఆదుకునే ‘పవర్ ఆఫ్లవ్ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు. కాగా సుగత దాస్కు ట్విన్ఇంజిన్సెస్నా 340 ఎయిర్క్రాఫ్ట్ఉంది. ఇందులో ఆయన యుమా మెడికల్సెంటర్కు వెళ్తుంటారు. సోమవారం మధ్యాహ్నం12.15 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియాలోని గ్రీన్కాజిల్ స్ట్రీట్పరిసరాల్లో ట్విన్- ఇంజిన్ సెస్నా సి340 కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ప్రమాదం జరిగిన పక్కనే ఓ స్కూల్ఉంది. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే, స్టూడెంట్స్అంతా సేఫ్గా ఉన్నారని, పేరెంట్స్భయపడొద్దని స్కూల్యాజమాన్యం ట్వీట్ చేసింది.