300 మెట్రిక్​ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తాం : జీఎం చౌరాసియా

300 మెట్రిక్​ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తాం : జీఎం చౌరాసియా
  •     ఎస్‌ఎండీసీ జీఎం చౌరాసియా

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు : 2030 వరకు 300 మెట్రిక్​ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసే దిశగా  జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) పనిచేస్తోందని ఆ సంస్థ జీఎం చౌరాసియా పేర్కొన్నారు. సోమవారం గీతం డీమ్డ్​ యూనివర్శిటీ, ఎలక్ర్టికల్స్​ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో 'ఐవోటీ అప్లికేషన్లలో వీఎల్​ఎస్​ఐ కోసం అవకాశాలు -సవాళ్లు' అనే అంశంపై ఆరు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ప్రారంభమైంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలిలోని ఏటీఏఎల్​అకాడమీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చౌరాసియా ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.

దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే ఎన్​ఎండీసీ పర్యావరణ అనుకూల మైనింగ్ పద్దతులకు కట్టుబడి ఉందని, ఆస్ర్టేలియాలోని ఎగసీ గోల్డమైన్​తో కలిసి మధ్యప్రదేశ్​లోని పన్నాలో బంగారం వెలికితీత పనులు ప్రారంభించామని తెలిపారు. గీతం, ఎన్ఎండీసీ మధ్య సహకారం ఎళ్లప్పుడూ కొనసాగుతందని వెల్లడించారు. కోర్​ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్​ రామశాస్ర్తీ, డాక్టర్​ సుమన్​లతా త్రిపాఠి, డాక్టర్ దుర్గేశ్​నందినీ, మంజునాథచారి పాల్గొన్నారు.