జనగామలో గూడ్స్ ట్రైన్ లో పొగలు..అధికారుల అప్రమత్తం

జనగామలో గూడ్స్ ట్రైన్ లో పొగలు..అధికారుల అప్రమత్తం

జనగామ జిల్లా: జనగామ రైల్వే స్టేషన్ లో గూడ్స్ ట్రైన్ లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బొగ్గుతో ఉన్న గూడ్స్ బోగీలో పొగను గుర్తించిన గార్డ్ వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బంది పొగను ఆర్పివేశారు. ఈ నేపథ్యంలో రైల్వే విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.