మళ్లీ నటిస్తున్న స్మృతి ఇరానీ

మళ్లీ నటిస్తున్న స్మృతి ఇరానీ
  • ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ-2’ షూటింగ్​లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి

న్యూఢిల్లీ: అలనాటి సీరియల్ నటి, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ రెండు దశాబ్దాల అనంతరం టెలివిజన్​లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఐకానిక్ షో ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ రెండో సీజన్​లో జడ్ ప్లస్​ సెక్యూరిటీతో ఆమె పాల్గొన్నారు. రెండు దశాబ్దాల క్రితం స్మృతి ఇరానీ ఈ షోలో తులసి విరానీ పాత్రను పోషించి ఇంటిల్లిపాదికి చేరువయ్యారు. ఈ పాత్ర భారతీయ టెలివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటిగా నిలిచింది. ఈ షో 2000 నుంచి 2008 వరకు ప్రసారమైంది. దీనిని శోభా కపూర్, ఏక్తా కపూర్  సొంత నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  నిర్మించారు.

తాజాగా ఈ సీరియల్ రెండో సీజన్ లో స్మృతి ఇరానీ నటించడం ప్రారంభించడంతో సెట్స్ లో కఠినమైన నిబంధనలు విధించారు. ఎటువంటి సన్నివేశాలు లీక్ కాకుండా సెట్స్​లోకి సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. ఆమె చుట్టూ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ సీరియల్ ఫస్ట్ సీజన్​లో నటిస్తూనే 2003లో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో చేరి కేంద్ర మంత్రిగా సేవలందించారు.