ఎమ్మార్వో ఆఫీసులో పాము క‌ల‌క‌లం

ఎమ్మార్వో ఆఫీసులో పాము క‌ల‌క‌లం

ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండల  కేంద్రంలోని  తహసీల్దార్ కార్యాలయంలో  పాము కలకలం  రేపింది.  దాదాపు 90 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కార్యాలయం  పూర్తిగా  శిథిలావస్థకు చేరుకుంది. అంతేకాకుండా  పాములకు తేళ్లకు  ఆవాసంగా  మారింది. ఉదయం కార్యాలయన్నీ  శుభ్రం చేస్తున్న  సమయంలో  దాదాపు 7 ఫీట్ల నాగుపాము.. దానితో పాటు   పాము కుబుసం  కనిపించిందని కార్యలయ సిబ్బంది తెలిపారు. పాత  రికార్డ్ లు  పెట్టిన ప్రదేశంలోకి వెళ్లి పోయిందన్నారు.  అయితే మళ్ళీ  ఏ సమయంలో  ఎటు వైపు నుండి వస్తుందోనని  భయంతో  విధులు నిర్వహిస్తున్నామంటున్నారు. అంతేకాకుండా  భవనం పూర్తిగా  పాడై పోయిందని... స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడిపోతుంద సిబ్బంది  అంటున్నారు. నూతన భవన నిర్మాణం  త్వరగా పూర్తి  చేయాలని కోరుతున్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండి: 

లతా మంగేష్క‌ర్ ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌