చేర్యాలలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

చేర్యాలలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

చేర్యాల, వెలుగు: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సోమవారం అధికారులు సామాజిక తనిఖీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో 18 గ్రామాల పనులపై అధికారులు ఆడిట్​ నిర్వహించారు. మొత్తం రూ. 8 కోట్ల పనులకు సంబంధించి సోషల్​ఆడిట్​ కొనసాగగా ఆయా గ్రామాల జీపీ సెక్రటరీలు, ఫీల్డ్​ అసిస్టెంట్లు అందజేసిన వివరాలపై విచారణ చేపట్టారు. సాగులో ఉన్న భూమిలో పనులు చేయించడం, కూలీల సంతకాలు లేకుండా డబ్బులివ్వడం, 7 రిజిస్టర్లు సరిగా మెయింటెనెన్స్​ చేయకపోవడం, 3 నెలలకొకసారి ఎంపీడీఓ, ఏపీఓ వెరిఫికేషన్​ చేయకపోవడాన్ని గుర్తించారు. 

మస్టర్స్​లో ఎక్కువ రోజులు పని చేసిన వారికి తక్కువ రోజులు, తక్కువ రోజులు పనిచేసిన వారికి ఎక్కువ రోజులు చేసినట్లు వేసి పేమెంట్ చేసినట్లు గమనించారు. ఆడిట్​లో రూ. 19వేలు రికవరీ, 17వేల ఫైన్లు వేసినట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్​డీఆర్​డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రణయ్, డీవీఓ గణేశ్, సంతోష్ రెడ్డి, ఏపీడీ సతీశ్, అంబుడ్స్​మెన్​ఆరిఫ్, ఏఈ శివకుమార్​, ఏపీఓ మంజులా, ఎస్​ఆర్​సీ పాండురంగ, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.