
గత కొన్ని రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. కాగా ఇప్పటికే ఓ యువతి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపుగా రూ.2 కోట్లు తీసుకుని మోసం చేసాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇటీవలే హర్ష సాయి పై మరో కేసు నమోదైంది.
పూర్తీ వివరాల్లోకి వెళితే తనపై ఆన్లైన్ ట్రోలింగ్కు పాల్పడుతున్నాడని ఓ సోషల్ మీడియా ఇంఫ్లేన్సర్ యువతి హైదరాబాద్ లోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో హర్ష సాయి తన అనుచరలతో కలసి తనపై నెగిటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.
Also Read : హెడ్ లైన్స్లో నిలిచిన 'ఢిల్లీ ఫైల్స్తో' వస్తోన్న
అంతేగాకుండా ఈ విషయానికి సంబంధించి పలు స్క్రీన్ షాట్లు కూడా బాధితురాలు పోలీసులకి షేర్ చేసింది. ఈ క్రమంలో తనపై నెగిటివ్ ట్రోలింగ్ కి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులను కోరింది. దీంతో భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.