భార్యాపిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి అదే చివరి ప్రయాణమైంది. విహారయాత్ర ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. గుండెపోటుతో మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. సత్యవేడు మండలం చెరివి పంచాయతీ చిగురుపాళెంకు చెందిన ప్రభాకర్రెడ్డి(45)సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. సత్యవేడు మండలం చెరివి పంచాయతీ చిగురుపాళెంకు చెందిన ప్రభాకర్రెడ్డి(45)సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆయన ఇటీవల నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఓ అపార్ట్మెంటులో ఫ్లాట్ను కొనుగోలు చేసి గృహప్రవేశం చేశారు. ఆదివారం సరదాగా భార్యాపిల్లలతో గడిపేందుకు మండలంలోని ఉబ్బలమడుగుకు విహారయాత్రకు వచ్చారు. సాయంత్రం వరకు సరదగా గడిపిన ఆయన కుటుంబం.. ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో సంతోష్పురం వద్ద ప్రభాకర్ రెడ్డికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పి.. బోల్తా పడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితులను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రభాకర్రెడ్డి మృతి చెందారు. భార్య రజితకు తలకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నాలుగేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న బాబు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
భార్యాపిల్లలతో టూర్కెళ్లిన వ్యక్తి మృతి
- ఆంధ్రప్రదేశ్
- November 22, 2021
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు