భార్యాపిల్లలతో టూర్‎కెళ్లిన వ్యక్తి మృతి

భార్యాపిల్లలతో టూర్‎కెళ్లిన వ్యక్తి మృతి

భార్యాపిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి అదే చివరి ప్రయాణమైంది. విహారయాత్ర ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. గుండెపోటుతో మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. సత్యవేడు మండలం చెరివి పంచాయతీ చిగురుపాళెంకు చెందిన ప్రభాకర్‌రెడ్డి(45)సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. సత్యవేడు మండలం చెరివి పంచాయతీ చిగురుపాళెంకు చెందిన ప్రభాకర్‌రెడ్డి(45)సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆయన ఇటీవల నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఓ అపార్ట్‌మెంటులో ఫ్లాట్‎ను కొనుగోలు చేసి గృహప్రవేశం చేశారు. ఆదివారం సరదాగా భార్యాపిల్లలతో గడిపేందుకు మండలంలోని ఉబ్బలమడుగుకు విహారయాత్రకు వచ్చారు. సాయంత్రం వరకు సరదగా గడిపిన ఆయన కుటుంబం.. ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో సంతోష్‌పురం వద్ద ప్రభాకర్ రెడ్డికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పి.. బోల్తా పడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితులను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రభాకర్‌రెడ్డి మృతి చెందారు. భార్య రజితకు తలకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నాలుగేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న బాబు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.