
మేడ్చల్, వెలుగు: తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చాయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్(35), కొడుకు షేక్ సాతక్ కలిసి మంగళవారం రాత్రి మోపెడ్పై శామీర్పేట వైపు వస్తున్నారు.
మార్గమధ్యలో తుర్కపల్లిలోని యాడారం ప్రజయ్ హోమ్స్ వద్ద అర్ధరాత్రి తండ్రీకొడుకులతో పాటు సాతక్ ఫ్రెండ్ రాజు కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న సాతక్.. తండ్రి నిజాముద్దీన్ను బండరాయితో కొట్టి హత్య చేశాడు. పోలీసులు సాతక్తో పాటు అతడి ఫ్రెండ్ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.