
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఘటన
జన్నారం, వెలుగు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని సేవదాస్ నగర్కు చెందిన జాదవ్ శంకర్ నాయక్(58)కి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉండగా, భార్య రెండేండ్ల కింద చనిపోయింది. కొడుకు నూర్సింగ్ మద్యానికి బానిస కావడంతో రెండేండ్ల కింద భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి తండ్రి శంకర్ నాయక్ తో మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని గొడవ పడేవాడు. ఈక్రమంలో శనివారం శంకర్ నాయక్ ఇంట్లో రొట్టెలు చేసుకుంటుండగా, నూర్సింగ్ మద్యం మత్తులో రోకలిబండతో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై శంకర్నాయక్ అక్కడిక్కడే చనిపోయాడు. ఘటనా స్థలాన్ని లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి సందర్శించి వివరాలు సేకరించారు.
మృతుడి కూతురు జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.