
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆదివారం (జూన్ 15) ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ సంబంధింత సమస్యతో ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రస్తుతం ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీ డిపార్ట్ మెంట్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించారు.
అనారోగ్య సంబంధిత సమస్యలతో జూన్ 7న కూడా ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు ఫిబ్రవరిలో కూడా గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స అనంతరం కోలుకున్నారు.
తాజాగా మళ్లీ ఆస్పత్రిలో చేరడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ఆమెను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi has been admitted to Sir Ganga Ram Hospital in Delhi. She has been admitted to the gastro department due to stomach-related problem and is under observation: Sir Ganga Ram Hospital pic.twitter.com/LT40WAYD1L
— ANI (@ANI) June 15, 2025