శ్రీనగర్​లో సోనియా బోట్ రైడ్

శ్రీనగర్​లో సోనియా బోట్ రైడ్

శ్రీనగర్: కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ శనివారం శ్రీనగర్​కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆమె నిజిన్ లేక్​ను సందర్శించి, బోట్ రైడ్​ను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కూడా అక్కడే ఉన్నారు. శుక్రవారం కార్గిల్ నుంచి శ్రీనగర్​కు చేరుకున్న రాహుల్.. నిజిన్ లేక్ లోని హౌస్ బోట్ లో బస చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా శ్రీనగర్ కు వస్తారని.. ఆదివారం అందరూ కలిసి గుల్ మార్గ్ కు వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇది పూర్తిగా ఫ్యామిలీ టూర్ అని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేవని తెలిపాయి. అయితే రాహుల్ శనివారం హౌస్ బోట్ లో నే ఉంటారని, ఆయన ఫ్యామిలీ మాత్రం రైన్ వారి ఏరియాలోని ఓ హోటల్ లో బస చేస్తుందని చెప్పాయి. రాహుల్ కుటుంబానికి ఈ హోటల్ సెంటిమెంట్ అని పేర్కొన్నాయి. కాగా, రాహుల్ వారం పాటు లడఖ్​లో పర్యటించారు. పాంగాంగ్ లేక్, నుబ్రా వ్యాలీ, ఖర్దుంగ్లా టాప్ తదితర ప్రాంతాలను సందర్శించారు.