కరోనాపై పోరుకు సోనియా గాంధీ ఐదు సూచనలు

కరోనాపై పోరుకు సోనియా గాంధీ ఐదు సూచనలు

కరోనా ను అరికట్టేందుకు ఎంపీల జీతంలో 30 శాతం కోత విధించటాన్ని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సమర్థించారు. కరోనా ను సమరవంతంగా ఎదుర్కోవాలంటే మరో 5 సూచనలు పాటించాలంటూ ప్రధాని మోడీకి మంగళవారం లెటర్ రాశారు. కరోనా కట్టడికి ఏం చేద్దామంటూ ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, పార్టీల నేతల సలహాలు, సూచనలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి పొదుపు చర్యలు చేపట్టాలంటూ సూచిస్తూ సోనియా లెటర్ రాశారు. ‘ప్రధాని మోడీ ఇచ్చిన ప్రతి సూచనను ఆదేశాన్ని ప్రజలు పాటిస్తున్నారు. ఈ సమయంలో వారి నమ్మకాల్ని, ఆశల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిగా మీపై ఉంది’ అని లెటర్లో పేర్కొన్నారు. కరోనాపై పోరుకు 5 సూచనలు పాటించాలని కోరారు.

1 “సెంట్రల్ విష్ట ” పేరుతో రూ. 20 వేల కోట్ల ఖర్చుతో నిర్మించ తలపెట్టిన కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ ను నిలిపి వేయాలి. ఇప్పటికిప్పుడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ భవనం అవసరం లేదు. ఈ నిధులతో ప్రజల కోసం కొత్త హాస్పిటల్స్, పీపీఈ కిట్లు, డయా గ్నోస్టిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేసి కరోనాను కట్టడి చేయాలి.

2.రెండేళ్లపాటు ప్రింట్, ఎలక్ర్టానిక్, ఆన్ లైన్ లో గవర్నమెంట్ యాడ్స్ ను ఆపేయాలి. వీటి ద్వారా రూ. 2500 కోట్లు మిగులుతాయి.

3.రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, ప్రభుత్వాధికారుల ఫారెన్ టూర్లను హోల్డ్ చేయాలి. ఆయా టూర్లకయ్యే డబ్బును కరోనా నివారణకు ఖర్చు చేయాలి.

4.దేశ బడ్జెట్ లో 30 శాతం ఖర్చును తగ్గించుకోవాలి. దీని ద్వారా కనీసం రూ. 2.5 లక్షల కోట్లు అందుబాటు లోకి వస్తాయి. ఈ మొత్తాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణకు, వలస కూలీలు, లేబర్స్, రైతులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవటానికి వినియోగించాలి. అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో పని చేసే ప్రతీ ఒక్కరికీ రక్షణ కల్పించాలి.

5.”పీఎం కేర్స్ ఫండ్స్” ను “ప్రైమ్ మిని స్ట ర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ” కు ట్రాన్స్ ఫర్ చేయాలి. ప్రతిపైసాకు పారదర్శకత ఉండాలంటే వెంటనే ఈ ఫండ్స్ ను బదిలీ చేయాలి.