సోనియా మాట శిలాశాసనం : సీఎం రేవంత్

సోనియా మాట శిలాశాసనం : సీఎం రేవంత్
  •  ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తం 
  • రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాలు ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: 6 గ్యారంటీలను నూటికి నూరుశాతం అమలు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్​లో రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాలను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు సిలిండర్, జీరో కరెంట్​బిల్లులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లా డారు. ‘‘అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ మాట ఇచ్చారు. 

ఆమె మాట శిలాశాసనం. తప్పకుండా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం” అని తెలిపారు. ‘‘హామీలు అమలు కాకపోతే బాగుండు అని తండ్రి, కొడుకు, అల్లుడు అనుకుం టున్నరు. హామీలపై తప్పుడు ప్రచారాలు చేస్తు న్నారు. కానీ ప్రజలు వారిని నమ్మడం లేదు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఏం మాట్లాడినా పిల్లి శాపనార్థనాలకు ఉట్టి తెగిపడదు” అని రేవంత్​ అన్నారు. 

ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నం: భట్టి 

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. హామీలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘తెల్లరేషన్​కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వాళ్లందరికీ ఫ్రీ కరెంట్ స్కీమ్ అమలవుతుంది. మార్చి నుంచి జీరో బిల్లు వస్తుంది. ఇందులో ఎలాంటి ఆంక్షలు లేవు.” అని చెప్పారు. రూ.500కే గ్యాస్ ​సిలిండర్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.