Hajj Yatra: హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ సర్కార్

Hajj Yatra: హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ సర్కార్

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. మక్కా సందర్శించడానికి ప్రతి ఏటా కోట్లమంది జనాలు తరలి వస్తారు. అయితే, కరోనా కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం గత మూడేండ్లుగా కొన్ని ఆంక్షలు పెట్టింది. వాటిని తొలగిస్తూ సౌదీ మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్ రబియా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

కరోనా కారణంగా మక్కా సందర్శకుల సంఖ్యను 10 లక్షలకు తగ్గించింది. అంతేకాకుండా వయే పరిమితి విధిస్తూ 18 నుంచి 65 ఏండ్ల వయసు కలిగిన వాళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. వాళ్లు తప్పని సరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాలని, హెల్త్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే అనుమతిస్తామని చెప్పింది. హజ్ ఎక్స్ పో 2023 ప్రారంభం కానుండగా.. ఇప్పుడు ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, జూన్ నెలాఖరులో హజ్ యాత్ర ప్రారంభం కానుంది. దానికోసం త్వరలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.