లింగంపల్లి స్టేషన్ లో రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తనిఖీ

లింగంపల్లి స్టేషన్ లో రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తనిఖీ
  • ఆర్సీ పురంలోనూ  అధికారులతో కలిసి పరిశీలన

హైదరాబాద్​ సిటీ, వెలుగు: నగరంలోని లింగంపల్లి, రామచంద్రాపురం రైల్వే స్టేషన్​లను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్​కుమార్​ శ్రీవాస్తవ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెయిటింగ్ హాల్, టికెటింగ్ సౌకర్యాలు, లిఫ్ట్​లు, ప్లాట్​ఫామ్​తో పాటు ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. స్టేషన్​లోని రైలు నిర్వహణ సౌకర్యాలను కూడా సమగ్రంగా పరిశీలించారు. 

ట్రాక్​ల పరిస్థితి, మౌలిక వసతుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాలు, కార్యకలాపాల సామర్థ్యాన్ని ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రైల్వే సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డివిజనల్ అధికారులు స్టేషన్​లో తదుపరి విస్తరణ, అభివృద్ధి ప్రణాళికల గురించి జనరల్ మేనేజర్​కు వివరించారు. ఆయన వెంట సికింద్రాబాద్ డీఆర్ఎం డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ అధికారులు,  బ్రాంచ్ అధికారులు ఉన్నారు.