ఆదాయం లేక 31 స్టేషన్లు మూసివేయనున్న దక్షిణ మధ్య రైల్వే

ఆదాయం లేక 31 స్టేషన్లు మూసివేయనున్న దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 29 స్టేషన్లు మూతబడుతుండగా… ఏప్రిల్‌ 1 నుంచి మరో 2 స్టేషన్లు మూతబడతాయన్నారు. అయితే ఈ స్టేషన్లన్నీ కూడా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ఒక్క స్టేషన్‌ మాత్రం మహారాష్ట్రలోని నాందేడ్‌ పరిధిలో ఉందని చెప్పారు.

సికింద్రాబాద్ పరిధిలో 16, గుంతకల్‌ పరిధిలో 3, నాందేడ్‌ పరిధిలో 1, గుంటూరులో 4, హైదరాబాద్‌లో 7 స్టేషన్లను మూసివేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఏయే రైల్వే స్టేషన్లలో ఆదాయం రావడంతో పాటు రద్దీగా ఉంటుందనే దానిపై దృష్టి సారించి తాత్కాలికంగా స్టేషన్‌నుల మూసివేతకు నిర్ణయం తీసుకుంది.