హైదరాబాద్, వెలుగు: పండుగలను పురస్కరించుకొని సౌతిండియా షాపింగ్ మాల్ తన కస్టమర్లకు కానుకలు, డిస్కౌంట్లు, లక్కీ బంపర్ డ్రా వంటివి అందుబాటులోకి తెచ్చింది. పోయిన నెల 12న మొదలైన ఫెస్టివల్ సేల్ ఈ నెల 25 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా షాపింగ్ చేసిన వారికి రూ.ఆరు కోట్ల విలువ చేసే బహుమతులను ఇస్తారు. విజేతల పేర్లను 5.10.22, 25.10.22 తేదీల్లో లక్కీడ్రా తీసి ప్రకటిస్తారు.
వీరికి 50 మారుతీ సుజుకీ ఎస్ప్రెస్సో కార్లు, 130 బైక్వో ఎలక్ట్రిక్ బైకులు, 100 వెండి పళ్లేలు, 1,140 ఇండక్షన్ స్టవ్లు, 480 ట్యాబ్స్ వంటివి ఇస్తారు. చీరెలు, మెన్స్వేర్పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. కేవలం మూడుశాతం తరుగుతో బంగారు నగలు, తరుగు, మజూరీ లేకుండా వెండి నగలు అందుబాటులో ఉన్నాయని సౌతిండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ పీవీఎస్ అభినయ్ చెప్పారు. మొత్తం రెండు వేల మందిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులను అందిస్తామని చెప్పారు.
