వీరితో సినిమాలు చేయాలంటే రెమ్యూనరేషన్కే కోట్లు కావాలి

వీరితో సినిమాలు చేయాలంటే రెమ్యూనరేషన్కే కోట్లు కావాలి

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బాలివుడ్లో కూడా హవాను కొనసాగించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. రష్మిక మందన్న, సమంత, నయన్, త్రిష, కీర్తి సురేశ్​ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆరోగ్య సమస్య కారణంగా ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సిటాడెల్, చెన్నై స్టోరీస్ లతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. సమంత ఒక్కో సినిమాకు  రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

తెలుగు, తమిళ్లో స్టార్ హీరోయిన్ అంటే నయనతార..ఈ అమ్మడు హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇటీవలే జవాన్తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ మూవీకు నయన్ ఏకంగా రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది.

21 ఏండ్లుగా సౌత్ ఇండస్ట్రీలో రాణిస్తూ..నాలుగు పదుల వయస్సులో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మ త్రిష..ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ సైతం పెంచేసింది. త్రిష రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు ఉంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

మిల్క్ బ్యూటీ తమన్నదాదాపు రూ.7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..ఓటీటీ ప్లాట్ ఫాంపై వరుసగా వెబ్ సిరీస్లు చేస్తూ బిజీ అయ్యింది. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా సినిమాలకు తక్కువ టైం ఇస్తోంది.

కీర్తి సురేష్ కూడా ప్రస్తుతం రూ.3 కోట్లు రెమ్యూనరేషన్గా తీసుకుంటోంది. ఇక వీరితో సినిమాలు చేయాలంటే రెమ్యూనరేషన్కే కోట్లు కావాలి మరి.