భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని ఎస్పీ బి. రోహిత్ రాజు పోలీస్ ఆఫీసర్లను ఆదేశించారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో సోమవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిత్యం నిఘా పెట్టాలన్నారు. పోక్సో కేసుల్లోని నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు సతీశ్కుమార్, చంద్రభాను, రవీందర్, మల్లయ్య స్వామి, బి.అశోక్పాల్గొన్నారు.
