మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు : ఎస్పీ రోహిత్​ రాజు

మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు : ఎస్పీ రోహిత్​ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్టులకు సహకరించే వారిపై చర్యలు తప్పవని తునికాకు కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఎస్పీ బి. రోహిత్​ రాజు హెచ్చరించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​లో తునికాకు కాంట్రాక్టర్లు, వ్యాపారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్ గఢ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన తునికాకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు అలర్ట్​ ఉండాలన్నారు. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తునికాకు సేకరణపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ఏ మాత్రం నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మావోయిస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు ఇవ్వాలని సూచించారు.