శాంతి భద్రతలను కాపాడుదాం : ఎస్పీ వినీత్​

శాంతి భద్రతలను కాపాడుదాం  : ఎస్పీ వినీత్​

భద్రాద్రికొత్తగూడెం. వెలుగు: పోలీస్​ అమర వీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమవుదామని ఎస్పీ డాక్టర్​ వినీత్​ పేర్కొన్నారు. పోలీస్​ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని హేమచంద్రాపురంలోని పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లో శనివారం నిర్వహించారు. అమరవీరుల స్థూపానికి ఎస్పీతో పాటు పోలీస్​ అధికారులు, సిబ్బంది నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ  పోలీసులు ముందున్నారన్నారు. 

 ప్రోగ్రాంలో ఓఎస్డీ  సాయి మనోహర్​, ఏఆర్ అడిషనల్​ఎస్పీ విజయ్ బాబు,  ఏఎస్పీ పంకజ్​ పరితోష్​, డీఎస్పీలు వెంకటేశ్, రెహమాన్​, రాఘవేందర్​రావు, రమణమూర్తి, మల్లయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు. అలాగే లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ ఆరో బెటాలియన్​లో అమరవీరుల స్థూపం వద్ద బెటాలియన్ ఆఫీసర్లు నివాళి అర్పించారు. కార్యక్రమంలో​ అడిషనల్​ కమాండెంట్​ అంజయ్య, ఏఓ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్​ కమాండెంట్స్​ సీతారాం, నాగేశ్వరరావు, కాళీదాసు, వీరన్న, ఆర్ఐ, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.