![రెండో రోజు 14 నామినేషన్లు](https://static.v6velugu.com/uploads/2023/11/speaker-pocharam-srinivas-reddy_V8scOubioZ.jpg)
నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో శనివారం రెండో రోజు14 నామినేషన్లు దాఖలయ్యాయి. బోధన్ నుంచి కాంగ్రెస్అభ్యర్థి పి.సుదర్శన్రెడ్డి తరఫున ఆ పార్టీ లీడర్లు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. నిజామాబాద్అర్బన్లో దండు లత (బీఎల్ఎఫ్), రాగి అనిల్(ఇండిపెండెంట్) రూరల్సెగ్మెంట్నుంచి దేగావత్శివరాం (ఇండిపెండెంట్), సాయన్న (ఆల్ ఇండియా మజ్లిస్ –ఏ– ఇంక్విలాబ్మిల్లత్), ఆర్మూర్లో ఎన్.ప్రణయ్గౌడ్(ఇండిపెండెంట్) నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఆరుగురు ఇండింపెండెంట్అభ్యర్థులు రమేశ్కుమార్, చంద్రశేఖర్, నటరాజు, నిఖిల్రెడ్డి, సంతోష్కుమార్, సాయన్న నామినేషన్లు వేశారు. బాన్సువాడలో బీఆర్ఎస్ తరఫున స్పీకర్పోచారం శ్రీనివాస్రెడ్డి, జుక్కల్లో బీఎస్పీ నుంచి ఏకాంబికర్ నామినేషన్ వేశారు.