
వెలుగు, హైదరాబాద్: తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారి అప్లికేషన్ల ప్రాసెసింగ్ కోసం సికింద్రాబాద్ లోని రీజనల్ పాస్పోర్టు ఆఫీస్ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ స్నేహజ ఒక ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్13, 15, 18 తేదీలలో మాత్రమే ప్రత్యేక కౌంటర్ తెరచి ఉంటుందని, రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా పంపబడిన పాస్పోర్టులు మాత్రమే ప్రాసెసింగ్ చేయబడతాయని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నారు. దరఖాస్తు దారులు తప్పని సరిగా జనవరి 31, 2025 వరకు చెల్లుబాటు అయ్యే పాస్పోర్టును కలిగి ఉండాలని పేర్కొన్నారు.