ఇందూరు పోరు వెరీ స్పెషల్‌

ఇందూరు పోరు వెరీ స్పెషల్‌

లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటుదేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పసుపు, ఎర్రజొన్న రైతుల తిరుగుబాటుతో ఇక్కడ జరిగే ఎన్నికలు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాయి.ఈ సెగ్మెంట్‌ నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 176 మందిరైతులున్నారు . తమ పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, సమస్యలు తీర్చాలని రైతులు పోటాపోటీగా నామినేషన్లు వేయటంతో ఈ పోలింగ్‌ఎన్నికల సంఘానికి సవాల్ గా మారింది. ఒకరకంగా ఈసీ దీన్ని చాలెంజింగ్‌గా తీసుకుంది.నిజానికి 90 మందికి మించి పోటీలో ఉంటేబ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించాల్సి వస్తుందని రైతులు భావించారు. ఎన్నిక కొంతకాలంవాయిదా పడొచ్చన్న ఊహాగానాలు వచ్చాయి.కానీ వాటికి ఈసీ చెక్ పెట్టిం ది. ఎం3 మోడల్ఈవీఎంలను తయారు చేయించి .. ఒక్కోపోలింగ్ కేంద్రం లో 12 బ్యాలెట్ యూనిట్లతోఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఖర్చుకు వెనుకాడకుం డా అవసరమైనంత మంది సాంకే తిక నిపుణులను, సిబ్బందిని మోహరిస్తోం ది. షెడ్యూల్ ప్రకారమే పోలిం గ్ నిర్వహించేం దుకు రెడీ అయిం ది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచిముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌ కుమార్తె, సిట్టింగ్‌‌‌‌ ఎంపీకవిత, కాం గ్రెస్‌‌‌‌ నుంచి మధు యాష్కీ గౌడ్, బీజేపీనుంచి ధర్మపురి అరవిం ద్ పోటీలో ఉన్నా .. ఎన్నికమొత్తం పసుపు రైతుల చుట్టే తిరుగుతోం ది. ఈ నియోజకవర్గం పరిధిలో పసుపు, ఎర్రజొన్న రైతులుపెద్ద సంఖ్యలో ఉన్నా రు. దాదాపు 70 వేల ఎకరాల్లోపసుపు, 40 వేల ఎకరాల్లో ఎర్రజొన్న పండిస్తారు.

కాస్ట్లీ ఎలక్షన్..
దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా12యూనిట్ల ఈవీఎంలతో జరుగుతున్న ఎన్నికలుఇవే కావట. ఎన్నికల నిర్వహణకు ఈసీ రు.35కోట్లు ఖర్చు చేస్తోంది. నియోజకవర్గాల వారీగాఖర్చు చూస్తే ఈ ఎన్నికే అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కనుంది. నిజామాబాద్ లోక్‌ సభ పరిధిలో15.52 లక్షల మంది ఓటర్లున్నారు. నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 5, జగిత్యాల జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ సెగ్మెంట్‌‌‌‌లో ఉన్నాయి. పోలింగ్ నిర్వహణకు 1,788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 12 బ్యాలెట్ యూనిట్లు ఓ వీవీప్యాట్తో కూడిన ఎం 3 ఈవీఎంలను వాడుతున్నారు. పోలింగ్ స్టేషన్ లో వీటిని ఎల్ ఆకారంలో అమర్చనున్నారు. ఎన్నికల పోటీలో ఉన్న 185 మంది, నోటాతో కలిపి 186 గుర్తులు ఈవీఎంలలో ఉంటాయి. వీటిని పరీక్షించడానికి బెంగళూరు బీఈఎల్ నుంచి 600 మంది ఇంజనీర్లు వచ్చారు.యుద్ధప్రాతిపదికన ఈవీఎంల చెకింగ్ పనులు చేపట్టారు.

వరల్డ్ రికార్డు
ఇప్పటివరకు దేశంలో ఎం.2 ఈవీఎంల ద్వారా4 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించటంరికార్డు. కానీ నిజామాబాద్‌‌‌‌లో ఎం3 ఈవీఎంల తోఒక్కో కేంద్రం లో 12 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఎం.3ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతోఈ ఎన్నిక గిన్నిస్ బుక్ రికార్డుకెక్కే అవకాశంఉందని అధికారులు చెబుతున్నా రు. ఈ పనినితక్కువ సమయంలో చేయడం రికార్డంటున్నారు.

స్పెషల్ మాన్యువల్
కేంద్ర ఎన్నికల సంఘం నిజమామాద్‌‌ ఎన్నికకు ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఆదేశాలు, నిబంధనలు జారీ చేయటం గమనార్హం. గతంలో జరిగినలోక్‌ సభ ఎన్నికల్లో 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టోరల్ అధికారిని ఈసీనియమించేది. అయితే ఇక్కడ ప్రతి అయిదు పోలింగ్ కేంద్రాలకో సెక్టోరల్ అధికారిని నియమిస్తున్నారు. సెక్టోరల్ అధికారితో పాటు నిపుణుల బృందం కూడా ఉంటుంది.

టైం మారింది..
నిజామాబాద్‌‌‌‌లో పోలింగ్ టైంను కూడామార్చారు. అన్ని నియోజక వర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. కానీ.. ఇక్కడ ఉదయం8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు గంటల పాటు మాక్ పోలింగ్‌‌‌‌కు టైం కేటాయించారు. ఎన్నికల నిర్వహణకు ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటుమరో ఐదుగురు విధుల్లో ఉంటారు.

బలగం భారీగానే..
పోలింగ్ నిర్వహణకు మొత్తం 1,438 ప్రిసైడింగ్ అధికారులు 1,438 సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 4,314 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. 1,788 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా 26, 820బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు,2,600 వీవీప్యాట్‌‌‌‌లు వాడనున్నారు.

ప్రత్యేకంగా హెలీప్యాడ్లు
నిజామాబాద్ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అధికారుల రాకపోకలకు వీలుగా సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రత్యేకంగా హెలీప్యాడ్లను సిద్ధంగా ఉంచారు. సీఈవో రజత్ కుమార్‌‌‌‌తో పాటు ఈసీఐ నుంచి కూడా ప్రత్యేకంగా అధికారులు ఈ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై, రైతుల ఫిర్యాదులపై వివరాలు సేకరించారు. ఈ నెల 2నకేంద్ర ఎన్నికల సంఘం నుంచి డిప్యూటీ కమిషనర్ సుదీప్ జైన్,  ప్రోగ్రాం కన్సల్టెంట్ నిఖిల్ కుమార్, అడిషనల్ సీఈవో జ్యోతి బుద్ధప్రకాష్ ఇక్కడి పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 600 మంది బీఈఎల్ ఇంజనీర్లువచ్చారు