ప్రేమికుల కోసం స్పెషల్ ఆఫర్లు

ప్రేమికుల కోసం స్పెషల్ ఆఫర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రేమికుల రోజు సందర్భంగా ప్రముఖ మొబైల్‌‌ రిటైల్‌‌ సంస్థ ‘సెలెక్ట్‌‌ మొబైల్స్‌‌’ ది గ్రాండ్‌‌ వాలంటైన్స్ డే పేరుతో స్పెషల్‌‌ ఆఫర్లను ప్రకటించింది. తమ సంస్థ అభివృద్ధిలో యువత కీలకం కాబట్టే వారికోసం ఈ నెల 13,14 తేదీల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నామని సెలెక్ట్‌‌ మొబైల్స్‌‌ సీఎండీ వై.గురు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెలెక్ట్‌‌ మొబైల్స్‌‌ షోరూమ్‌‌లలో ఆఫర్లు ఉంటాయి. ‘మా సంస్థ చాలా తక్కువ కాలంలోనే 65 షోరూమ్‌‌ల మైలురాయిని చేరుకుంది. ఈ ఉగాదికి ఐదు కొత్త షోరూమ్‌‌లు ప్రారంభిస్తాం. త్వరలో వీటి సంఖ్యను 100కు చేరుస్తాం’’ అని ఆయన వివరించారు.

ఆఫర్ల వివరాలు

రూ.8,999 విలువ గల 3జీ+32జీబీ
4జీ మొబైల్‌‌ కేవలం రూ.3,999లకే అమ్ముతారు.
రూ.6,999 విలువ గల మైజు మొబైల్‌‌ కేవలం రూ.3,999లకే వస్తుంది.
రూ.25 వేల విలువ గల శామ్‌‌సంగ్‌‌ ఏ6 మొబైల్‌‌ కేవలం రూ.8,999లకే లభ్యం
రూ.3,999 విలువ గల టీడబ్ల్యూఎస్‌‌ బ్లూటూత్‌‌ హెడ్‌‌సెట్‌‌ కేవలం
రూ.1,499లకే పొందవచ్చు.
రూ.1,999 విలువ గల బ్లూటూత్ స్పీకర్‌‌ కేవలం రూ.399లకే అమ్ముతారు
రూ.3,928 విలువ గల హైఎండ్‌‌
10,000 ఎంఏహెచ్‌‌ పవర్‌‌బ్యాంక్‌‌,
బ్లూటూత్‌‌ నెక్‌‌బ్యాండ్‌‌ కేవలం రూ.1,499లకే సొంతం చేసుకోవచ్చు.
టీసీఎల్‌‌ ఎల్‌‌ఈడీ టీవీతోపాటు ఉచిత హోమ్‌‌ థియేటర్‌‌ సిస్టమ్‌‌ను
రూ.12,143లకే పొందవచ్చు.
వీటితోపాటు అన్ని ప్రముఖ మొబైల్స్‌‌, ఆక్సెసరీలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయని గురు వివరించారు.

see also: బీఎస్‌-6 పల్సర్ వచ్చింది..!

see also: సర్కార్‌‌ సోలార్‌‌ పార్కులు లేనట్లే!