నిమ్స్​లో స్పెషల్​ ఓపీ వింగ్

నిమ్స్​లో స్పెషల్​ ఓపీ వింగ్

పంజాగుట్ట, వెలుగు : పంజాగుట్టలోని నిమ్స్​హాస్పిటల్​లో అంటు వ్యాధి బాధితుల కోసం స్పెషల్​ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు నిమ్స్​డైరెక్టర్​డాక్టర్​ఎన్.బీరప్ప బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాక్టీరియల్​ఇన్​ఫెక్షన్స్​కారణంగా చాలా మంది దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించిస్తే నివారణ సాధ్యమన్నారు. స్పెషల్​ఓపీ విభాగానికి అసిస్టెంట్​ప్రొఫెసర్​ను నియమించామని చెప్పారు. మంగళ, గురువారాల్లో జనరల్​ మెడిసిన్​ విభాగంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.