బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. కరోనా కారణంగా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఎన్నికలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించాలని చర్యలు చేపడుతోంది. అలాగే, కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా పోలింగు బూత్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే బహిరంగ సభలు, ర్యాలీలపైనా మార్గదర్శకాలు రూపొందించినట్టు సమాచారం. ర్యాలీలు, బహిరంగ సభల్లో భౌతిక దూరం పాటించేలా ఆయా ప్రదేశాల్లో మార్కింగ్ చేయాలని ఈసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పోలింగ్ స్టేషన్లను మరో 50 శాతం పెంచనుంది.
బీహార్ ఎన్నికలు జరగనుండటంతో ఇవాళ(శుక్రవారం) సమావేశం కానున్న ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహణ, మార్గదర్శకాలపై చర్చించనుంది. అలాగే వచ్చేనెల 20న ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఎన్నికలను రెండు,మూడు దశల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం.