ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా అమీన్ పీర్ దర్గాను సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహ్మాన్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకున్నారు. తిరుపతి నుండి రోడ్డు మార్గంలో కడప పెద్ద దర్గాకు చేరుకున్న రజనీకాంత్, ఏఆర్ రెహమాన్, ఐశ్వర్య రజనీకాంత్ లకు దర్గా పెద్దలు సంప్రాదాయ ప్రకారం స్వాగతం పలికారు. ఆ తర్వాత దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా విశిష్ఠతను రజనీకాంత్, ఏఆర్ రెహమాన్ అడిగి తెలుసుకున్నారు.
కడప పెద్ద దర్గాకు సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రావడంతో ఆ ప్రాంతానికి అభిమానులు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన నటుడు, అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. మరోవైపు రజనీకాంత్, రెహ్మాన్ రాకను దృష్టిలో పెట్టుకుని దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు.