పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18న పాత భవనంలో ప్రారంభమవుతాయి. అయితే గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 19న కొత్త భవనానికి తరలించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రత్యేక వర్షాకాల సమావేశాల వెనుక ఎజెండాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
'ఒక దేశం..ఒకే ఎన్నికలు', మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇండియాకు బదులుగా భారత్ ఉపయోగించడం వంటి ప్రాధాన్యత అంశాలు ఈ ఎజెండాలో ఉన్నాయి. అయితే వీటి సాధ్యాసాధ్యాలపై చర్చలు కొనసాగుతున్నాయి. సెప్టెంబరు 18నుంచి -22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తాము పాల్గొంటున్నట్లు ముందుగా ఇండియా కూటమి ప్రకటించింది.