బెల్లంపల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇండ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్ఇచ్చారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎవరైనా గొడవలు చేస్తే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామన్నారు. గురువారం బెల్లంపల్లి రూరల్సీఐ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన రౌడీ షీటర్లకు ఏసీపీ రవికుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ , ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.
