భద్రాచలం, వెలుగు : ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో పనిచేస్తున్న టీచర్లకు బీఎడ్ కాలేజీలో సోమవారం స్పెషల్ ట్రైనింగ్ను డీడీ అశోక్ ప్రారంభించారు. సబ్జెక్టు బోధన సామర్థ్యాలు పెంచేందుకు ఈ ట్రైనింగ్ దోహదపడుతుందని డీడీ అశోక్ పేర్కొన్నారు. హెచ్ఎంలు, టీచర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఐదు రోజుల పాటు ఈ ట్రైనింగ్జరుగుతుందని ఆయన చెప్పారు. హిందీ. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్కు 180 మంది టీచర్లు, 12 మంది డీఆర్పీలు హాజరయ్యారు.
